Saturday, May 4, 2024
- Advertisement -

సురభి వాణీదేవి గెలిచాక మాటలు ఇలా..!

- Advertisement -

నిన్నటి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తానికి టీఆర్ఎస్ అభ్యర్థిని సురభి వాణీదేవి గెలిచారు. తనకు అప్పగించిన గురుతర బాధ్యతను నిష్టతో నెరవేరుస్తానని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు.

హైదరాబాద్‌లో పీవీ ఘాట్‌ వద్ద వాణీదేవి నివాళి అర్పించారు. పీవీ ఘాట్‌ నుంచి ప్రచారం ప్రారంభించి.. ఎన్నికల్లో గెలిచి అక్కడే విజయం సాధించినట్లు ధ్రువపత్రం పొందడం గొప్ప క్షణమని ఆమె అన్నారు.

పట్టభద్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న ఎమ్మెల్సీ వాణీదేవి.. రాజకీయాలు తమ కుటుంబానికి కొత్త కాదని అన్నారు. తెలంగాణ బిడ్డ అయిన తండ్రి పీవీ నర్సింహారావుకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎనలేని గౌరవాన్ని ఇస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులకు వాణీదేవి ధన్యవాదాలు తెలియజేశారు.

జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తా!

అపరదానకర్ణుడు సోనూసూద్ కి అరుదైన గౌరవం!

నేటి నుంచి భారత్ లో అక్కడ లాక్ డౌన్ మొదలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -