- Advertisement -
రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఐపీఎల్లో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్లో వరుసగా ఐదేళ్లపాటు ఏటా 500కిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. పంజాబ్పై విరాట్ 48 రన్స్ చేయడంతో ఆర్సీబీ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అజేయంగా బెంగళూరును గెలిపించిన కెప్టెన్ ఈ సీజన్లో 500కిపైగా పరుగులు పూర్తి చేసుకున్నాడు.
కోహ్లి తొలిసారిగా 2011లో ఐపీఎల్లో 557 పరుగులు చేశాడు. 2013లో 634 పరగులు చేసిన విరాట్.. 2015లో 505 రన్స్ చేయగా.. 2016లో ఏకంగా 973 పరుగులు చేయడం గమనార్హం. 2016లో కోహ్లి రెండు సెంచరీలు బాదాడు.
ఇప్పటి వరకూ డేవిడ్ వార్నర్ నాలుగు సీజన్లలో 500కిపైగా పరుగులు చేయగా.. సురేశ్ రైనా, క్రిస్ గేల్, గౌతమ్ గంభీర్ 3 సీజన్లలో ఈ ఫీట్ సాధించారు.