ఐపీఎల్ 2018 సీజన్లో ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్ల టైమింగ్స్ మారనున్నాయి. చాలా మ్యాచ్లు స్లో ఓవర్ రేట్ కారనంగా దాదాపు మ్యాచ్లన్నీ రాత్రి 12 గంటలకి ముగుస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్లను ఒక గంట ముందుకు జరిపి అభిమానులకి ఉపశమనం కలిగించాలని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాత్రి 8 గంటలకి ఆరంభమవ్వాల్సిన మ్యాచ్ని 7 గంటలకే ప్రారంభిస్తారు. స్టేడియానికి వచ్చి మ్యాచ్ని వీక్షించే అభిమానులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈ టైమింగ్ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముంబయిలోని వాంఖడే వేదికగా మే 22న క్వాలిఫయర్ -1, మే 27న ఫైనల్ జరగనుండగా.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 23న ఎలిమినేటర్, 25న క్వాలిఫయర్ – 2 మ్యాచ్లు జరగనున్నాయి. తాజా మార్పుతో ఈ మ్యాచ్లు అన్నీ రాత్రి 7 గంటలకే ప్రారంభంకానున్నాయి.