సోషల్ మీడియా పుణ్యమాని అప్పటి వరకు ఎవరికి తెలయిని వారు రాత్రిరాత్రికే సెలబ్రటీలు అవుతున్నారు. కన్నుకొట్టే సీన్తో ప్రియాప్రకాశ్ వారియర్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. మొన్న ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ దీపిక ఘోస్ వెంటపడ్డ సోషల్ మీడియా ఇప్పుడు…ముంబయ్ ఫ్యాన్స్ గర్ల్పై కన్నేశారు. ఇంకే ముంది రాత్రి రాత్రికే ఫేమస్ చేశారు. దీంతో ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది.
ముంబయ్, చెన్నై మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో చిరునవ్వులు చిందిస్తూ.. కేరింతలు కొడుతున్న ఆమె టీవీలో అలా ఫ్లాష్ అయ్యిందో లేదో.. ఇలా ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఉత్కంఠగా ఆట జరుగుతున్న సమయంలో కెమేరా మ్యాన్ ఆమెనే ఫోకస్ చేశాడంటే.. ఆమె అందం ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది.
ఇంకే ముంది ఇంటర్నెట్లో నెటజన్లు తెగ వెతకడం ప్రారంభించారు. ఆమె వివరాలు దొరక్కుంటె ఊరుకుంటారా…! చివరకు ఆమె వివరాలు కనుగొన్నారు.ఆమె పేరు అతిథి హుందియా. 2018లో మిస్ దివా సూపర్ నేషనల్ టైటిల్ గెలుపొందింది.