Saturday, April 27, 2024
- Advertisement -

ముంబైని వీడనున్న రోహిత్?

- Advertisement -

ఐపీఎల్ 2024 సీజన్‌కు సర్వం సిద్ధమైంది. మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా టీమిండియా సారథి రోహిత్ శర్మను ముంబై కెప్టెన్సీ నుండి తప్పించింది ఆ జట్టు యాజమాన్యం. రోహిత్ స్థానంలో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పగా రోహిత్ ముంబైని వీడే అవకాశాలున్నాయని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ రోహిత్ నిజంగానే ముంబై జట్టును వీడితే ఖచ్చితంగా చెన్నై తరపున ఆడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాదు చెన్నై తరుపున కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఎందుకంటే ధోనికి ఇదే చివరి ఐపీఎల్. వచ్చే ఏడాది రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.

అందుకే ధోని స్థానాన్ని రోహిత్‌తో భర్తి చేయాలని భావిస్తోంది చెన్నై. ఇదే విషయాన్ని అంబటి రాయుడు వెల్లడించాడు. రోహిత్ చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని సూచించగా మరికొంతమంది హైదరాబాద్ పేరు చెబుతున్నారు.

మార్చి 22 నుండి ఐపీఎల్ ప్రారంభంకానుండగా మొదటి మ్యాచ్ చెన్నై మరియు బెంగళూరు మధ్య జరగనుంది. ముంబై జట్టుకు రోహిత్ నాలుగు టైటిల్స్ అందించింన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -