Sunday, April 28, 2024
- Advertisement -

ఆ క్రీడాకారులను చంపుతానంటోన్న ఐసిస్

- Advertisement -

యావత్ ప్రపంచం ఉగ్రవాద మూకల అరాచకాలతో దద్దరిల్లుతుంది. ఎంతగా మారుతున్నా కూడా ఇంకా ఉగ్రమూఖలు అలా పెరిగి పోతూనే ఉన్నాయి. అంతే కాకుండా వారు చేసే అరాచకాలు ఎంతో దారుణంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక చోట ఉగ్రదాడులు సంభవిస్తున్నాయి. ఇక మ్యాటర్ లోకి వస్తే… ఐఎస్ఐఎస్ భూతం.. తాజాగా ఓ భయంకర పోస్టర్ ని రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో 2018 ఫుట్‌బాల్ ప్రపంచ‌క‌ప్‌ను టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అదనే కాకుండా వరల్డ్ పాపులర్ ఫుట్ బాల్ ప్లేయర్లైన క్రిస్టియానో రొనాల్డో, నేమార్‌ల‌ను ఆధీనంలోకి తీసుకొని వారిని చిత్రహింసలు పెడుతున్నట్లుగా ఆ ఫొటోస్ లో తమ పైత్యాన్ని చూపించారు. తాము 2018 దాడి కోసం వెయిట్ చేస్తున్నట్లు మరొక పోస్టర్ లో చెప్పారు. ఈ పోస్టర్ల దెబ్బకు ఫుల్ బాల్ ప్లేయర్లు వణికిపోతున్నారు. మీడియాల్లో కూడా ఈ పోస్టర్ లపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

2018 జూన్ 14 నుంచి జులై 15 వరకు రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ జరగనుంది. రష్యా ఈ మద్యకాలంలో సిరియాతో పాటు ఎన్నో ముస్లీం సమీప దేశాలపై చేస్తోన్న దౌర్జన్యాలకు బదులుగా ఉగ్రవాద సంస్థలు ఇలాంటి డెసిషన్ ను తీసుకుందా అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -