మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే డే అండ్ నైట్ టెస్టులో టీమ్ఇండియా కన్నా తమ ఇంగ్లాండ్ జట్టే ఆధిపత్యం చెలాయిస్తుందని యువ బ్యాట్స్మన్ జాక్క్రాలే ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవలే ఓ బ్రిటీష్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియాలో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్, పేరొందిన పేస్ బౌలింగ్ త్రయమున్నా తమ జట్టే ఫేవరెట్ అని పేర్కొన్నాడు. అది పేస్ పిచ్ కాబట్టి, అందులో తమకు పూర్తి ప్రావీణ్యం ఉందన్నాడు.
అయితే, తొలి టెస్టుకు ముందు అనూహ్యంగా చెపాక్ డ్రెస్సింగ్ రూమ్లో కిందపడి గాయపడిన అతడు మూడో టెస్టుకు ముందు కోలుకున్నాడు. దీంతో బుధవారం నుంచి ప్రారంభమయ్యే డే అండ్ నైట్ మ్యాచ్కు ఎంపికయ్యాడు.
“గాయం తర్వాత పూర్తిగా కోలుకున్నా. నెట్స్లో సాధన చేస్తున్నా. అయితే, రెండో టెస్టుకే కోలుకోవాలని ప్రయత్నించా కానీ కుదరలేదు. ఇక రాబోయే మ్యాచ్లో మళ్లీ ఓపెనర్గా దిగాలని చెప్పినా నాకేం ఇబ్బంది లేదు. అయితే, జట్టు అవసరాలను బట్టి మూడో స్థానంలో ఆడించినా సిద్ధమే” అని క్రాలే పేర్కొన్నాడు.
జినోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్.. కేటీఆర్ హామీ..!