బల్దియా మేయర్గా గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఛార్జ్ తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు.. మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలిపారు.
ఈనెల 11న ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్లుగా విజయలక్ష్మీ, శ్రీలత ఎన్నికయ్యారు. ఐదేళ్ల వరకు ఈ పదవుల్లో కొనసాగనున్న వీరు.. నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుపై గౌరవంతో ఆయన కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ నుంచి విరమించి సహకరించాలని కోరారు.
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయో? లేదో ? ఇలా తెలుసుకోండి !