Sunday, April 28, 2024
- Advertisement -

బల్దియా మేయర్​గా గద్వాల్ విజయలక్ష్మీ ఇన్..!

- Advertisement -

బల్దియా మేయర్​గా గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్​గా మోతె శ్రీలత బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఛార్జ్ తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు.. మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలిపారు.

ఈనెల 11న ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్​లుగా విజయలక్ష్మీ, శ్రీలత ఎన్నికయ్యారు. ఐదేళ్ల వరకు ఈ పదవుల్లో కొనసాగనున్న వీరు.. నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుపై గౌరవంతో ఆయన కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ నుంచి విరమించి సహకరించాలని కోరారు.

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయో? లేదో ? ఇలా తెలుసుకోండి !

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. మాజీ ప్రధాని కూతురు!

పోలవరం ప్రాజెక్టు లో ఒక్కో గడ్డర్ బరువు తెలుసా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -