టీ20 ప్రపంచకప్ లాంటి పోటీలో పర్ఫెక్ట్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ స్పష్టం చేశారు. కొలంబోలో న్యూజిలాండ్పై చివరి ఓవర్లో ఉత్కంఠభరిత విజయంతో సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకున్న తర్వాత జాక్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీలో తన నాలుగో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న ఆయన, ఫలితం ముఖ్యమని, పరిపూర్ణత కాదని అన్నారు.
మేము ఏడు మ్యాచ్లలో ఆరు గెలిచాం. సెమీఫైనల్కు అర్హత సాధించాం. చివరికి ఎవరికీ పర్ఫెక్ట్ గేమ్ గురించి పట్టదు. గెలవడం ముఖ్యం. టీ20 క్రికెట్లో ఇది సహజం. అంతేకాదు, పరిపూర్ణ ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం,” అని న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల విజయానంతరం జాక్స్ తెలిపారు.
హ్యారీ బ్రూక్ నాయకత్వంలో ఇంగ్లాండ్ పలుమార్లు కష్టసమయాల్లోనూ తిరిగి పుంజుకుంది. న్యూజిలాండ్పై 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి మూడు ఓవర్లకు 43 పరుగులు అవసరమైన వేళ, రేహాన్ అహ్మద్ జాక్స్కు జతయ్యాడు. ఇద్దరూ ధైర్యంగా ఆడి మ్యాచ్ను మూడు బంతులు మిగిలి ఉండగానే ముగించారు.
ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్పై ముందురోజు శ్రీలంక బ్యాటర్లు న్యూజిలాండ్ స్పిన్నర్లకు ఇబ్బంది పడిన దృశ్యాలు చూసినందున తాను టెన్షన్లో ఉన్నానని జాక్స్ ఒప్పుకున్నారు. అది పెద్ద లక్ష్యం. ఏదో ప్రత్యేకంగా చేయాల్సిందేనని తెలుసు అని అన్నారు.
18వ ఓవర్ టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ ఓవర్లో రేహాన్ అహ్మద్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి మొత్తం 22 పరుగులు సాధించారు. ఆ సిక్సర్ మాకు నమ్మకం ఇచ్చింది. తర్వాత నేను 6, 4, 4 కొట్టడంతో మ్యాచ్ మలుపుతిరిగింది. ఇలాంటి చిన్న క్షణాలే గేమ్ను మార్చేస్తాయి అని జాక్స్ వివరించారు.
