Tuesday, April 30, 2024
- Advertisement -

కేకేఆర్ విధ్వంసం..ఫ్యాన్స్‌కు కన్నుల పండగ

- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో రికార్డు పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇక ఎస్‌ఆర్‌హెచ్ విధ్వంసం మర్చిపోకముందే కేకేఆర్..ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు చేస్తే కేకేఆర్..272 పరుగులు చేసింది.

డిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 7 వికెట్లు కొల్పోయి 272 పరుగులు చేసింది. నరైన్ (85), రఘువంశీ (54), రసెల్ (41), రింకూ సింగ్ (26) పరుగులు చేసి రాణించారు. ముఖ్యంగా నరైన్,రసెల్ సిక్సర్ల వర్షం కురిపించారు. కోల్ కతా బ్యాట్స్‌మెన్‌ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయారు ఢిల్లీ బౌలర్లు. ఈవిజయంతో కోల్ కతా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.

అనంతరం లక్ష్యచేధనలో ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయితే ఆ జట్టుకు కలిసివచ్చే విషయం ఏంటంటే పంత్ ఫామ్‌లోకి రావడం. 25 బంతుల్లోనే 55 పరుగులు చేసి రాణించాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -