Saturday, May 11, 2024
- Advertisement -

రాజ‌స్థాన్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచిన రాజస్థాన్ జట్టు నెట్ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా నాలుగో స్థానంలో ఉంది.

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు.. గత శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 245 పరుగుల భారీ స్కోరు‌తో రికార్డు నెలకొల్పడమే కాకుండా.. 31 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే ఇరు జట్లకీ ఈ మ్యాచ్ చాలా కీలకం కావడంతో.. పోరు రసవత్తరంగా జరగనుంది.

రాజస్థాన్‌ తుది జట్టులో ఇష్‌ సోధి, అనిరుధ్‌ సింగ్‌, రాహుల్‌ త్రిపాఠి చోటు దక్కించుకున్నారు. కోల్‌కతాలో పీయుష్‌ చావ్లా స్థానంలో శివమ్‌ మావి వచ్చాడు.

కోల్‌కతా జట్టు: క్రిస్‌లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్, శుభమన్ గిల్, జవాన్ సీయర్లెస, ప్రసీద్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, అంజింక్య రహానె, సంజు శాంసన్, బెన్‌స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, స్టువర్ట్ బిన్నీ, జోప్రా ఆర్చర్, గౌతమ్, జయదేవ్ ఉనద్కత్, ఇస్ సోధి, అనురీత్ సింగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -