Friday, May 17, 2024
- Advertisement -

తొలి బంతికే రాహుల్‌ ఔట్ …

- Advertisement -

భారత్-శ్రీలంకల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నేటి ఉదయం 9 గంటలకు వేయాల్సిన టాస్, మధ్యాహ్నం ఒంటి గంటకు వేశారు. టాస్ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడ్డ కారణంగా పచ్చిక ఉన్న ఈడెన్ మైదానంలో బౌలింగ్ ఉత్తమమని లంక కెప్టెన్ దినేష్ చండిమాల్‌ భావించాడు. శ్రీలంక తీసుకున్న నిర్ణ‌యం ఫ‌లితాన్నిచ్చింది.

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆల‌స్యంగా ప్రారంభ మ‌యిన భార‌త్, శ్రీలంక మొదటి టెస్టు మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక మొద‌ట బౌలింగ్ ఎంచుకున్న విష‌యం తెలిసిందే. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. సురంగ నక్మ‌ల్ బౌలింగ్‌లో టీమిండియా ఓపెన‌ర్ లోకేశ్ రాహుల్ అవుట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో శిఖ‌ర్ ధావ‌న్ (0), ఛ‌టేశ్వ‌ర్ పుజారా (0) ఉన్నారు. మొద‌టి ఓవ‌ర్ ముగిసే స‌మ‌యానికి టీమిండియా స్కోరు ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -