- Advertisement -
స్కూల్ టీచర్గా మారారు. సడన్గా ఓ గవర్న్మెంట్ స్కూల్లో ప్రత్యక్షమైన మాస్టర్ బ్లాస్టర్ను చూసి అక్కడి విద్యార్థులు అవాక్కయ్యారు. స్కూల్లో పిల్లలతో కాసేపు ముచ్చటించిన ఆయన…. వారికి పాఠాలు కూడా చెప్పారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని… అందరూ శ్రద్ధ పెట్టి చదవాలని సూచించాడు.
తన తండ్రి కూడా కాలేజీ ప్రొఫెసర్ అని గుర్తు చేశారు. అందుకే తన మనసులో ఉన్న ఆలోచనల్ని పంచుకుంటున్నాని చెప్పారు. అలాగే స్కూల్ బాగోగులు… విద్యార్థుల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత పిల్లలకు క్రికెట్ బ్యాట్లు, బాల్స్, ఫుట్బాల్స్ అందించారు.
స్కూల్ టీచర్లు కొన్ని సమస్యలు సచిన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వసతులు కల్పించేందుకు తన ఎంపీ నిధులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు టెండుల్కర్కు కృజ్ఞత లు తెలిపారు.