- Advertisement -
ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత్కి మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో నూ, బాక్సింగ్లోనూ పతకాలను రానున్నాయి. ఉత్తర కొరియా డబుల్స్ క్రీడాకారులతో ఈరోజు జరిగిన ఉత్కంఠ పోరులోభారత్ జోడీ శరత్ కమల్, మణిక బాత్రా 3-2 తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరారు.అలానే బాక్సింగ్లోనూ వికాస్ కృష్ణన్ భారత్కి పతకం ఖాయం చేశాడు. 75 కేజీల విభాగంలో పోటీపడిన వికాస్ కృష్ణన్.. క్వార్టర్ ఫైనల్స్లో చైనా బాక్సర్ తంగ్లైతెన్ని 3-2 తేడాతో ఓడించి సెమీస్ చేరాడు.