ప్రపంచ కప్లో సెమీస్ గండాన్ని అధిగమించింది భారత్. న్యూజిలాండ్తో ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్..48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ బ్యాట్తో విజృంభిస్తే షమీ వన్ మ్యాన్ షోతో అలరించాడు. నిప్పులు చెరిగే బంతులు వేస్తూ 7 వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. మిచెల్(134) ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది,
ఇక అంతకముందు తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ ఔటైనా విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్ అద్భుతంగా ఆడి భారీ స్కోరు చేయడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా విరాట్ తన 50వ సెంచరీ కంప్లీట్ చేసి రికార్డు సృష్టించాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 117 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 105 పరుగులు చేశారు. గిల్ 82 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇక ఇవాళ ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో తలపడనుంది భారత్. ) ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది.