- Advertisement -
న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. విజయంలో పేషర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. షమీ (3/19) అద్భుత బౌలింగ్ను కనబరచారు. భారత మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లలో షమీ ఒకడని భోగ్లే కొనియాడాడు. కివీస్తో మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన షమీ వరల్డ్కప్ బెర్తును ఖాయం చేసుకున్నాడన్నాడు.
వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఏడాదిన్నర కాలంగా పలువురు పేసర్లు పరీక్షిస్తూ వస్తోంది. భువనేశ్వర్, బూమ్రాలకు జతగా సరైన పేసర్ కోసం అన్వేషిస్తుంది. ఈ తరుణంలో షమీ ఫామ్లోకి రావడం శుభ పరిణామం. వరల్డ్కప్కు ఇంగ్లండ్కు వెళ్లే భారత జట్టులో షమీకి చోటు ఖాయం అని హర్షా భోగ్లే తెలిపాడు. అయితే అతనిపై ఎక్కువ వత్తిడి లేకుండా చూసుకోవాలని బీసీసీఐకి సూచించారు.