Tuesday, April 30, 2024
- Advertisement -

ముంబై అదుర్స్..రెండో విజయం

- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా రెండో విజయాన్ని నమోదు చేసింది ముంబై. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని 15 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్..ఆర్సీబీ బౌలర్లను చీల్చిచెండాడారు.ఇషాన్ కిషన్ (69), రోహిత్ శర్మ(38), సూర్య కుమార్ యాదవ్ (52), హర్ధిక్ పాండ్యా (21) పరుగులు చేశారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్య సిక్సర్లు వర్షం కురిపించారు. దీంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది ముంబై.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 196 పరుగులు చేసింది. డూప్లెసిస్ (61), పాటిదార్ (50), దినేష్ కార్తీక్ (53) పరుగులతో రాణించారు. ముఖ్యంగా కార్తీక్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అలరించాడు.

ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరిన ఆర్సీబీ..మరో రెండు మ్యాచ్ లు ఓడిపోతే ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లినట్లే. ఇక ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో డిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -