శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా ముందు లంక బౌలర్లు తేలిపోతున్నారు.భారత్ను కట్టడి చేసేందుకు లంక కెప్టెన్ చండీమాల్ ఏకంగా 5గురు బౌలర్లను రంగంలోకి దించాడు. అయినప్పటికీ ఫలితం రాబట్టలేకపోతున్నాడు.
రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అదరగొట్టడంతో పటిస్టస్థితిలో టీమిండియా ఉంది. తన కెరీర్ లో 10వ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 187 బంతులను ఎదుర్కొన్న మురళీ విజయ్… 9 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఈ ఘనతను సాధించాడు. మరో ఎండ్ లో చటేశ్వర్ పుజారా 62 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కంటే భారత్ మరో 29 పరుగులు వెనుకబడి ఉంది. మురళీ, పుజారాలు ఇప్పటి వరకు 163 పరుగుల పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు లంక బౌలర్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఫలితం దక్కలేదు. లంక కెప్టెన్ చండీమాల్ ఏకంగా 5గురు బౌలర్లను రంగంలోకి దించాడు. అయినప్పటికీ ఫలితం రాబట్టలేకపోతున్నాడు.