- Advertisement -
ముక్కోణపు టీ 20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో భారత్ జట్టు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్ ధావన్(90; 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు తోడు మనీష్ పాండే(37), రిషబ్ పంత్(23)లు ఫర్వాలేదనిపించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరును సాధించకల్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ డకౌట్గా అవుట్ కావడంతో పాటు సురేశ్ రైనా(1) కూడా నిరాశపరిచాడు. శ్రీలంక బౌలర్లలో చమీరా రెండు వికెట్లు సాధించగా, నువాన్ ప్రదీప్, జీవన్ మెండిస్, గుణతిలకాలు తలో వికెట్ సాధించారు.