- Advertisement -
మొన్న పాక్ పేసర్ అమీర్ టెస్ట్ లకు గుడ్ బై చెప్పన తర్వాత మరో పాస్ట్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించారు. పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో సీనియర్లు అమీర్ పై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో ఆమిర్ తర్వాత రియాజ్ టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నాడా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశాడు అక్తర్.
తాజాగా 34 ఏళ్ల వహాబ్ రియాబ్ టెస్టులకు వీడ్కోలు చెప్పాడట. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడని, ఇక కేవలం సాధారణ ప్రకటన మాత్రమే చేయాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితె పాక్ టీమ్ పై తీవ్ర ప్రభావం పడనుంది. వహాబ్ రియాబ్ 27 టెస్టు మ్యాచ్లు ఆడిన రియాజ్ 83 వికెట్లు తీశాడు.