పాక్ క్రికెటర్లు ఇండియా అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కొత్తేమి కాదు. గతంలోహీర్ అబ్బాస్, మోహ్సిన్ హసన్ ఖాన్, షోయాబ్ మాలిక్లు కూడా భారత యువతులనే పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా హసన్ అలీ భారత యువతను పెళ్లాడుతున్న నాలుగో పాక్ క్రికెటర్గా హసన్ నిలువనున్నాడు.
పాకిస్తాన్ యువ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ హర్యానాకు చెందిన షమియా అర్జూతో మంగళవారం నిఖా చేసుకోనున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దుబాయ్లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో వీరి వివాహం చాలా సింపుల్గా, అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనుందని హసన్ అలీ సన్నిహితుడు పేర్కొన్నాడు.
పెళ్లి సందర్భంగా హసన్ అలీ బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు.ఈ సందర్భంగా ‘బ్యాచిలర్గా చివరి రాత్రి’అంటూ ట్వీట్ చేశాడు. హసన్ ట్వీట్పై సానియా మీర్జా స్పందించారు. ‘హసన్కు అభినందనలు, మీరిద్దరూ జీవితాంతం ప్రేమతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి కలిసినప్పుడు మంచి ట్రీట్ ఇవ్వాలి’అంటూ సానియా శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో వీరిద్దరిపై వచ్చిన ప్రేమ వార్తలను ఖండించిన హసన్ తర్వాత…అనంతరం తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, కానీ వివాహానికి సమయం పడుతుందని వెల్లడించారు.దుబాయ్ లోనె ఓకామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని అది ప్రేమగా మారిందని చెప్పుకొచ్చారు.