పాకిస్తాన్ హెడ్ కోచ్ గా ఆ దేశ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ ను నియమిస్తూ పీసీబీ ఉత్వర్వులు జారీ చేసింది.పాకిస్తాన్ కోచ్ పదవి కోసం పలువురు దిగ్గజాలు పోటీ పడ్డప్పటికీ మిస్బావుల్కే పీసీబీ పెద్దలు పెద్ద పీట వేశారు. ఈసారి వదేశీ కోచ్ లకు అవకాశం ఇవ్వకుండా …స్వదేశీ కోచ్ల్లో మిస్బావులే యోగ్యుడిగా భావించి అతనికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది.మిస్బా.. కోచ్ సహా సెలెక్షన్ కమిటీ చైర్మన్గానూ వ్యవహరిస్తారని ఈ సందర్భంగా పీసీబీ పేర్కొన్నది.
ఇక బౌలింగ్ కోచ్గా వకార్ యూనిస్ను నియమించారు. వీరు మూడు సంవత్సరాలకు గానూ ఈ భాద్యతలు నిర్వహిస్తారు.2017 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన మిస్బావుల్ తన తాజా నియామకంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనపై ఉంచిన అతి పెద్ద బాధ్యతగా పేర్కొన్నాడు. ఇప్పుడు తనపై చాలా అంచనాలు ఉన్నాయని, దాన్ని సాకారం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడమే తన ముందున్న లక్ష్యమని తెలిపాడు.
శ్రీలంకతో త్వరలో స్వదేశంలో జరగనున్న వన్డే, టీ-20 సిరీస్ నుంచి వీరు అందుబాటులోకి రానున్నారు. తదుపరి, టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా పాక్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. నవంబర్ 21 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది