- Advertisement -
అద్బుతమైన టెక్నిక్, అసాధారణ ఆటతో అందరి దృష్టి ఆకర్షించిన అండర్ -19 కెప్టెన్ పృథ్వీ షా ,తన ఇంటర్నేషనల్ మొదటి మ్యాచ్ను చాలా ఘనంగా ఆరంభించాడు.వెస్టిండీస్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఈ యువ సంచలనం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.ఆడుతున్న మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.
101 బంతుల్లోనే 100 పురుగులు చేసి తన కెరీర్లో మొదటి సెంచరీని పూర్తి చేశాడు.వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా టెస్టుల్లో టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగిన రెండో అతి పిన్నవయస్కుడిగా ఘనత సాధించిన పృథ్వీషా.. అరంగేట్రం మ్యాచ్లోనే అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.