Monday, April 29, 2024
- Advertisement -

భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్!

- Advertisement -

రాంచి వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 20 ఓవర్లు ముగిసే సరికి కీలకమైన 5 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఇంగ్లాండ్ మంచి స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు రూట్.

అద్భుత సెంచరీతో రాణించాడు రూట్. 111 పరుగులతో క్రీజులో ఉండగా రాబిన్ సన్ 57 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ ఆరంగేట్ర మ్యాచ్ తోనే అదుర్స్ అనిపించాడు. అద్భుత పేస్‌తో ఆకట్టుకున్నాడు. తొలిరోజు ఇంగ్లాండ్ 7 వికెట్లు కొల్పోగా ఆకాష్ 3,సిరాజ్ 2, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.

అయితే ఆరంభంలోనే 5 వికెట్లు తీసినా తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడంలో విఫలమయ్యారు భారత బౌలర్లు. ఇక కీలక సమయాల్లో రివ్యూలు కోల్పోవడం భారత్ ను దెబ్బ తీసింది. 60 ఓవర్లలోపే రివ్యూలన్ని కోల్పోవడం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -