ఐపీఎల్ 2018లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఢిల్లీ డేర్డెవిల్స్పై ఘన విజయంతో బోణి కొట్టిన పంజాబ్ జట్టు ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.
ముఖ్యంగా జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ రికార్డుల్ని తిరగరాస్తూ మెరుపు అర్ధశతకం బాది సూపర్ ఫామ్లో ఉండటం.. బౌలర్లు కూడా తొలి మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.
మరోవైపు బెంగళూరు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కోల్కతాపై 176 పరుగులు చేసినా.. ఘోరంగా ఓడిపోవడం ఆ జట్టుని బాధించింది. బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా.. సునీల్ నరైన్ లాంటి బ్యాట్స్మెన్ 19 బంతుల్లోనే 50 పరుగులు చేయడం ఆ జట్టు వ్యూహాల బలహీనతని బహిర్గతం చేసింది. దీంతో.. రెండో మ్యాచ్లో.. అదీ కలిసొచ్చిన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్తో బోణి కొట్టాలని బెంగళూరు ఆశిస్తోంది.