- Advertisement -
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ వేదికగా జరుగుతున్న 2018 కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టర్లు భారత్కి పతకాల పంట పండిస్తున్నారు. తొలుత మీరాబాయ్ చాను స్వర్ణంతో భారత్ పసిడి ఖాతాను తెరవగా.. తర్వాత సంజిత చాను బంగారు పతకం సాధించి భారతీయుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
మూడోరోజు జరిగిన 77 కేజీల వెయిట్లిఫ్టింగ్ పురుషుల విభాగంలో సతీశ్కుమార్ శివలింగానికి స్వర్ణం లభించింది. దీంతో.. భారత్ ఖాతాలో ప్రస్తుతం మూడు బంగారు పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం చేరాయి. పతకాల పట్టికలో శుక్రవారం సాయంత్రం వరకూ ఐదో స్థానంలో ఉన్న భారత్.. తాజా స్వర్ణంతో మళ్లీ మూడో స్థానానికి ఎగబాకింది. భారత్ గెలిచిన పతకాలన్నీ.. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే రావడం కొసమెరుపు.