Friday, May 3, 2024
- Advertisement -

రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు

- Advertisement -

పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 212 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి 215 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ జోర్జి సెంచరీతో చెలరేగాడు. 6 సిక్స్‌లు, 9 ఫోర్లతో 119 పరుగులతో నాటౌట్‌గా నిలవగా హెన్రిక్స్‌ (52), డసెన్‌ (36) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌, రింకూసింగ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (62),కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56) పరుగులతో రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (4), తిలక్‌ వర్మ (10), సంజూ శాంసన్‌ (12), రింకూ సింగ్‌ (17), అక్షర్‌ పటేల్‌ (7) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా విజయంతో సిరీస్ సమం కాగా ఇరు జట్ల మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -