ప్రపంచకప్లో నేడు భారత్, శ్రీలంకల మధ్య ఆసక్తిపోరు జరగనుంది. ఇప్పటికే ఇండియా సెమీఫైన్ల్ చేరుకున్న సంగతి తెలిసిందే. లంకతో జరిగే మ్యాచ్లో గెలిచి పాయంట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసింది భారత్. ఇక శ్రీలంక భారత్ పై గెలిచి ప్రపంచకప్ నుంచి గౌరవంగా నిష్క్రమించాలని లంకేయులు భావిస్తున్నారు.
మొదటి నుంచి టాపార్డర్ రాణిస్తున్నా మిడిల్ సమస్యతో సతమతమవుతున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్లో ఆ లోపాల ను సరిదిద్దుకోవాలనుకుంటున్నది. మరోవైపు పేరుకు తగ్గట్లు రాణించలేకపోయిన లంకేయులు చివరి మ్యాచ్లోనైనా నెగ్గి విజయంతో టోర్నీ ముగించాలని ఆశతో ఉన్నారు.
ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన శ్రీలంక 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. నేటి మ్యాచ్లో గెలవడం ద్వారా విజయాల సంఖ్యను పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. సెమీస్లో అడుగుపెట్టినప్పటికీ శ్రీలంకతో పోరును భారత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. గ్రూప్ దశలో ఇంగ్లండ్కు షాకిచ్చిన శ్రీలంక బలంగానే ఉంది.
నేడే జరగనున్న మరో లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా మట్టికరిపిస్తే భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళ్తోంది. అదే జరిగితే సెమీస్లో భారత్-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్లు తలపడతాయి. ఒక వేల సఫారీలపై ఆస్ట్రేలియా గెలిస్తే సెమీ ఫైనల్లో మాత్రం ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది.