Monday, April 29, 2024
- Advertisement -

ప్రతి సీజన్‌లోనూ 300 పైచిలుకు పరుగులు

- Advertisement -
Suresh Raina New Record in IPL

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సురేశ్‌ రైనా. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు అతని పేరిటే ఉంది. ఐపీఎల్‌ పదికి ముందు దేశవాళీ క్రికెట్‌ ఆడింది తక్కువే. అందులోనూ అంతగా రాణించింది లేదు.

అలాంటిది ఈ సీజన్‌లో రైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఆరెంజ్‌ క్యాప్‌ బరిలో నిలిచాడు. అతడి సారథ్యంలోని గుజరాత్‌ లయన్స్‌ ఏప్రిల్‌ 27న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడింది. ఈ మ్యాచ్‌ రైనాకు ఎంతో ప్రత్యేకం.
గారాల పట్టి ముందరఈ మ్యాచ్‌లో రైనాకు అన్ని ఆనందాలే.. మొదటిది బెంగళూరు మ్యాచ్‌కు రైనా గారాల పట్టి గ్రేసియా వచ్చింది. ఇక రెండోది ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్‌లో 34 పరుగులతో అజేయంగా నిలిచిన రైనా సీజన్‌లో 309 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకొన్నాడు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ప్రతి సీజన్‌లోనూ 300 పైచిలుకు పరుగులు చేసిన ఒకేఒక్క క్రికెటర్‌గా అవతరించాడు. ఇక మూడోది తన బంగారుతల్లి ముందు ఆడిన మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవడం రైనా ఆనందాన్ని మూడింతలు చేసింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -