- Advertisement -
ఉప్పల్ టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రోహిత్ సేన 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్(11) రనౌట్గా కాగా టామ్ హర్ట్లే(36), బెన్ ఫోక్స్(36) కొద్దిసేపు ప్రతిఘటించినా హర్ట్లే(36)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో టీమిండియా విజయం ఖాయమైంది.దీంతో సిరీస్ను 1-1తో సమం చేసింది టీమిండియా.
ఓవర్ నైట్ స్కోరు 67 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ 292 పరుగలకు ఆలౌట్ అయింది. అయితే ఈ గెలుపుతో ఇంగ్లాండ్ హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని భావించిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్:396
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్:253
టీమిండియా రెండో ఇన్నింగ్స్:255
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్:292