Tuesday, May 7, 2024
- Advertisement -

విమ‌ర్శ‌కుల‌పై విరుచుకుప‌డిన టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి…

- Advertisement -

స‌ఫారీల‌తో టెస్ట్‌సిరీస్ 1-2 తేడాతో కోల‌ప్పోవ‌డంపై టీమిండియామీద విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తితెలిసిందే. తాజాగా విమ‌ర్శ‌కుల‌పై కోచ్ రవిశాస్త్రి విమర్శకులపై మండిప‌డ్డారు. టీమిండియా ఓడిపోతే భారత్‌లోని జనాలు (విమర్శకులను ఉద్దేశించి) ఆనందపడతారని అప్పుడప్పుడు తనకు అన్పిస్తుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఏ మ్యాచ్‌నైనా గెలుస్తామనే నమ్మకం తమకు ఎల్లప్పుడూ ఉంటుందని, అది కొద్దిమంది మాత్రమే గ్రహించారని, నిజానికి ఓడిన ఆ రెండు టెస్టు మ్యాచ్‌లను కూడా తాము గెలిచి ఉండేవాళ్లమని ఆయన చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్‌లు ఓడిపోగానే తదుపరి మ్యాచ్‌లు గెలవడమే గానీ డ్రా చేసుకోవడం ఉండరాదంటూ ఓ ప్రణాళికను రచించుకుని ముందుకు వెళ్లామని, ఫలితంగానే వన్డే, టీ-20 సిరీస్‌లను నెగ్గామని రవిశాస్త్రి వివరించారు. జోహ్నెస్ బర్గ్ పిచ్ పనికిమాలిన పిచ్ అని ఆయన వ్యాఖ్యానించారు.

దక్షిణాఫ్రికా సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆడిన మొత్తం 12 మ్యాచ్‌లలో ఎనిమిది మ్యాచ్‌లు గెలిచామని ఆయన గుర్తు చేశారు. లంక ముక్కోణపు సిరీస్ గురించి కూడా ఆయన మాట్లాడారు. విరామం లేకుండా ఆడినందు వల్ల జట్టులో సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చామని, వారు కూడా మనుషులే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఫార్మాట్ అయినా సరే మన జట్టే గెలవాలని భారత అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటారని, మనదేశంలో వచ్చిన అతిపెద్ద చిక్కు ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -