Tuesday, April 16, 2024
- Advertisement -

ఇండియ‌న్ ఆర్మీ కోసం మ్యాచ్ ఆడుతున్న టీమిండియా

- Advertisement -

ఆస్ట్రేలియాతో జ‌ర‌గుతున్న ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా మూడో వ‌న్డే రాంచీ వేదిక‌గా జ‌ర‌గుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భార‌త్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఈ మ్యాచ్‌ను ఇండియ‌న్ ఆర్మీ కోసం ఆడుతోంది. ఇటీవ‌లే ఉగ్ర‌వాదుల దాడిలో మ‌న జ‌వాన్లు 40 మందికి పైగా మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ద్వారా వ‌చ్చిన డ‌బ్బును మ‌ర‌ణించిన జ‌వాన్ల కుటుంబాల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు బిసిసిఐ త‌మ అధికార ట్విట్ట‌ర్‌లో తెలిపింది.

ఈ మ్యాచ్ మొద‌లుకావ‌డానికి ముందు జ‌ట్టు స‌భ్యుల‌కు ఆర్మీ క్యాప్‌ల‌ను అందించింది బిసిసిఐ. ఆర్మీ క్యాప్‌తోనే మూడో వ‌న్డే ఆడ‌నున్నారు భార‌త్ ప్లేయ‌ర్లు. టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఇప్ప‌టికే 5 వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -