Friday, May 10, 2024
- Advertisement -

ఆసియా కప్‌లో ఓటమెరుగని భారత్..కేసీఆర్

- Advertisement -

నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఏడోసారి ఆసియాకప్‌ను ముద్దాడింది భారత్‌. చివరి బంతి వరకూ అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించింది. టోర్నీ ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు.. ఫైనల్‌లో కాస్త తడబడినా చివరకు ఆ ఒత్తిడిని జయించి కప్‌ను కైవసం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే అనేక మంది మాజీ క్రికెట‌ర్లు ప్ర‌శంశ‌ల జ‌ల్లులు కురిపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ టైటిల్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆసియా కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలవడం అరుదైన విజయంగా అభివర్ణించారు. భారత జట్టు అన్ని రంగాల్లో రాణించిందని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచ్ లలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -