- Advertisement -
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ దంపతులు ముంబైలోని వోర్లీలో కొత్తగా కొనుగోలు చేసిన ‘ప్రేమగూటి’లోకి త్వరలోనే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇల్లు తాత్కాలికమైన ఏర్పాటేనని, ఇందులో వారు రెండేళ్ల పాటు మాత్రమే ఉంటారని సమాచారం.
రహేజా లెజండ్స్’ అపార్ట్మెంట్లోని 40వ అంతస్థులో ఓ ఫ్లాటును విరాట్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ఫ్లాటు విస్తీర్ణం 2675 చదరపు అడుగులు. అయితే ఈ ఫ్లాటుకు నెలకు అద్దె కింద వారు కళ్లుచెదిరిపోయే మొత్తాన్ని కట్టనున్నారు. విరాట్ దంపతులు దీనికి నెలకు రూ.15 లక్షల రెంట్ను చెల్లించనున్నారట. కోహ్లీ ఈ ఫ్లాట్కి డిపాజిట్ కింద రూ.1.5 కోట్లను, ఒప్పంద రిజిస్ట్రేషన్ కోసం మరో రూ.1.01 లక్షలు చెల్లించినట్లు తెలిసింది.