వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. దక్షిణాఫ్రికాతో ఆటకు సిద్ధమవుతోంది. 2017లో తిరుగులేని రికార్డులను సాధించింది. కొత్త సంవత్సరలో భారత జట్టు వచ్చే నెల 5 నుంచి దక్షణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ చేరుకుంది. ఈ సిరీస్కు టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లీ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు.
ప్రస్తుతం టెస్టుల్లో ఇండియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక వన్డేల్లో సౌతాఫ్రికా 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా టీమిండియా 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరా హోరీ పోరు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
After a long flight #TeamIndia make their way to the team hotel here in Cape Town, South Africa 🇿🇦 pic.twitter.com/lFr3ktBvlX
— BCCI (@BCCI) December 28, 2017