విరుష్క జంట స్నేహితులకు,బంధువులకు ఇచ్చిన విందు వినోదాలు అయిపోయాయ్. ఇక ఈకొత్తజంట దక్షిణాఫ్రికా టూర్కు వెల్లారు. భారత జట్టు దక్షిణాఫ్రికా టూర్కు బయలు దేరారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వెంట అతని భార్య అనుష్క శర్మ కూడా వెళ్లింది.
జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై భారత్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్ని ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల వివాహం చేసుకున్న ఈ జంట కొద్ది రోజులు అక్కడే గడపనుంది. అయితే.. జనవరి మొదటి వారం.. అంటే తొలి టెస్టు ఆరంభమైన తర్వాత.. అనుష్క శర్మ తిరిగి ముంబయికి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నా జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం కోసం క్రికెట్కి దూరంగా ఉన్నా.. ఇప్పుడు ఆ తంతు ముగిసింది. తిరిగి ఆటలోకి రావడం నాకు ఏమాత్రం కష్టం కాదు. ఎందుకంటే క్రికెట్ నా రక్తంలోనే ఉంది’ అని మీడియా సమావేశంలో ఉద్వేగంగా మాట్లాడిన విరాట్ కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశాడు. ‘కఠినమైన సఫారీ పర్యటన కోసం జట్టులోని ఆటగాళ్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మెరుగ్గా రాణించినప్పుడే కదా ఆటగాడికి సంతృప్తి లభిస్తుంది. గత పర్యటన కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని వెల్లడించాడు.
‘మా జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కఠిన పరిస్థితుల్లో బాగా రాణించినప్పుడు ఎక్కువ సంతృప్తి లభిస్తుంది. మా బౌలింగ్, బ్యాటింగ్ ఎంతో మెరుగుపడ్డాయి. దక్షిణాఫ్రికాలో కిందటిసారి కంటే ఈసారి మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తాం. ఇది మాకో మంచి అవకాశం’’ అని కోహ్లి చెప్పాడు.