- Advertisement -
టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. గత వన్డేలో భారీ విజయం సాధించి ఊపు మీద ఉన్న టీమిండియా సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుండగా, వెస్టిండీస్ సిరీస్ను సమం చేయాలనే యోచనలో ఉంది.
ఈ మ్యాచ్లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవ్వగా, విండీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా మొత్తం పర్యటనకే దూరమైన ఆశ్లే నర్స్ స్థానంలో దేవెంద్ర బిషూ తుది జట్టులోకి రాగా, హెమ్రాజ్ స్థానంలో ఒషేన్ థామస్ను జట్టులోకి తీసుకున్నారు.