Monday, May 6, 2024
- Advertisement -

భార‌త్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన విండీస్‌…

- Advertisement -

త్వరలో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెల్ల‌నుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టును ఎంపిక చేశారు సెల‌క్ట‌ర్లు. విండీస్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మొదట 3 టి20 మ్యాచ్ లు ఆడనుంది. మొద‌టి రెండు టీ20 మ్యాచ్‌ల‌కు విండీస్ జ‌ట్టును ప్ర‌క‌టించారు.సీనియర్ ప్లేయర్లు కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్ కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కొత్తగా వికెట్ కీపర్ ఆంథోనీ బ్రాంబుల్ జట్టుకు ఎంపికయ్యాడు. టీ20 కెప్టెన్‌గా కార్లోస్ బ్రాత్ వైట్ ను వ్వ‌వ‌హ‌రించ‌నున్నారు.

ప్ర‌స్తుతం గేల్ కెనడాలో జీటీ20 టోర్నీలో ఆడుతుండడంతో ఎంపిక చేయలేదు. దాంతో, కొత్తగా మరో ఎడమచేతివాటం ఓపెనర్ జాన్ క్యాంప్ బెల్ కు విండీస్ సెలెక్టర్లు అవకాశమిచ్చారు.

విండీస్ టీమ్

కార్లోస్ బ్రాత్ వైట్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, సునీల్ నరైన్, కీమో పాల్, ఖారీ పియరీ, కీరన్ పొలార్డ్, నికోలాస్ పూరన్, షిమ్రోన్ హెట్మెయర్, రోవ్ మాన్ పావెల్, ఆండ్రే రస్సెల్, ఒషానే థామస్, ఆంథోనీ బ్రాంబుల్, జాన్ క్యాంప్ బెల్, షెల్డన్ కాట్రెల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -