Sunday, May 5, 2024
- Advertisement -

టీమిండియా కొత్త ఆరెంజ్ జెర్సీ వీడియో విడుద‌ల‌…

- Advertisement -

టీమిండియా ప్లేయ‌ర్లు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కొత్త జెర్సీతో ద‌ర్శ‌న మివ్వ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బ్లూ జెర్సీతో ద‌ర్శ‌న మిచ్చే కోహ్లీసేన 30న ఇంగ్లండ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో ఆరెంజ్ రంగు జెర్సీ ధరించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ జెర్సీ వేసుకున్న కోహ్లీ సేన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్విట్ట‌ర్‌లో ఆ ప్లేయ‌ర్ల ఫోటోల‌ను పోస్టు చేశారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించడానికి వీల్లేదు. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్లూ జెర్సీనే ధరిస్తుండగా.. భారత్ మాత్రం వేరే రంగు జెర్సీని ధరించాల్సి ఉంది. దీనిలో భాగంగా బీసీసీఐ కోరిక మేరకు టీమిండియాకు ఆరెంజ్ రంగు జెర్సీని కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్నది. టీమిండియా స్పాన్సర్ నైకీ.. ఈ రోజు జెర్సీని అధికారికంగా విడుదల చేసింది.

అందరూ అనుకున్నట్లుగానే నారింజ, నీలి రంగు కాంబినేషన్‌లో కొత్త డ్రెస్ అదిరిపోయేలా కనిపిస్తున్నది. జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ అత్యుత్తమ శ్రేణిలో జెర్సీకి రూపకల్పన చేసింది. ఆటగాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా డ్రెస్‌ను డిజైన్ చేశారు. అయితే ఆరెంజ్ జెర్సీపై రాజ‌కీయ దుమారం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. దేశం మొత్తం కాషాయమయం చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందంటూ దుయ్యబట్టాయి ప్ర‌తిప‌క్షాలు. అంతే రీతిలో భాజాపా కూడా కౌంట‌ర్ ఇచ్చారు.

https://www.instagram.com/p/BzQzO8EArLx/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -