- Advertisement -
వెయిట్ చేసిన రోజు రానే వచ్చేసింది. తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంచనాలకి తగ్గట్టీ అన్నీ జరిగిపోయాయి. పార్టీ పగ్గాలని తన చేతిలోకి తీసుకోవాలి అని మొదటి నుంచీ పావులు కదుపుతున్న జయలలిత నెచ్చెలి శశికళ గెలిచేసింది.
ఆమెకు పోటీగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. అమ్మ మేనకోడలు దీప పేర్లు అన్నాడీఎంకే పార్టీలో వినిపించాయ్ . వ్యక్తిపూజకు పెద్దపీట వేసే తమిళనాడు రాజకీయాల్లో అమ్మ తర్వాత చిన్నమ్మే అన్నట్లుగా సాగుతున్న ప్రచారానికి తగ్గట్లే పరిణామాలు సాగి పోయాయి.పార్టీ కార్యవర్గ సమావేశానికి కార్యవర్గ సభ్యులు 280 మంది.. 50 జిల్లాల కార్యదర్శులు.. మరో 2770 మంది సర్వ సభ్యులు పాల్గొననున్న ఈ సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటు చేస్కోలేదు అనుకున్నట్టు గానీ శశికళ కి పగ్గాలు ఇచ్చేసారు.