Sunday, May 19, 2024
- Advertisement -

మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తారా…..?

- Advertisement -
Bhuma Akhila Priya about Nandyala By-Election Ticket

నంద్యాల ఉప ఎన్నిక మ‌రింత ర‌స‌వ్త‌రంగా మారింది. టికెట్టు త‌మ కుటుంబానికే కేటాయించాల‌ని భూమా అఖిల‌ప్రియ పెట్టుకున్న ఆశ‌ల‌కు బాబు షాక్ ఇచ్చారు. ఒక మంత్రి ప‌దవి ఇచ్చాం కాబ‌ట్టి టికెట్టు శిల్పా వ‌ర్గానికి అనుకూలంగా ఉండ‌టంతో భామా అఖిల ప్రియ స‌దిగ్దంలో పడ్డ‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్టు కేటాయింపు త‌ల‌నొప్పిగా మారిన బాబుకు ఇప్పుడు మ‌రో స‌మ‌స్య కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాను ఒక‌టి త‌లిస్తే… దైవం ఇంకొటి త‌లించిన‌ట్లు బాబు ప‌రిస్థితి అలానే ఉంది. టికెట్టు ద‌క్క‌పోవ‌డంతో అఖిల‌ప్రియ మంత్రిపద‌వికి రాజీనామా చేసే అలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఈ వార్త క‌ర్నూలు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఇటీవల భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ సీటు వ్యవహారంలో భూమా ఫ్యామిలీకి, చంద్రబాబుకు మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు వినికిడి. మొద‌ట భూమా ప్యామిలీకే టికెట్టు ఇస్తామ‌ని చెప్పిన బాబు త‌ర్వాత మాట మార్చ‌డ‌తో భూమా అఖిల‌ప్రియ అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి మరణం తర్వాత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను టీడీపీ నేత చంద్రబాబు మంత్రిని చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదట వైకాపా నుండి పోటీ చేసి గెలిచిన తండ్రీ కూతురు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. అఖిల ప్రియ‌కు ఇచ్చిన మంత్రిప‌ద‌వికి అంత‌గా ప్రాధాన్య‌త‌లేద‌నే స‌మాచారం. నంద్యాల ఉప ఎన్నిక టికెట్టు విష‌యంలో భూమాకుటుంబానికి ఇవ్వ‌కుండా ఉండేదానికే అఖిల ప్రియ‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌నేది స‌మాచారం.
ఆ సమయంలో టీడీపీ నుండి బరిలోకి దిగి భూమా చేతిలో ఘోరంగా ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి ఈ సారి ఖాళీ అయిన స్థానంలో మళ్లీ టీడీపీ నుండి అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి భూమా అఖిల ప్రియా రెడ్డి ససేమిరా అంటున్నారు. అది తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన స్థానమని అందువల్ల ఆ టిక్కెట్ తమకే కేటాయించాలని ఆమె పట్టుపడుతోందట. దీంతో టీడీపీ అభ్యర్థి ఎంపికలో సందిగ్ధత నెలకొంది.
అదేసమయంలో టీడీపీ టిక్కెట్ ఇవ్వకుంటే వైకాపా చేరి ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తానంటూ శిల్పా మోహన్ బాహాటంగా ప్రకటించారు. దీంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయి అఖిల ప్రియను బుజ్జగిస్తున్నారు. కానీ భూమా ఫ్యామిలీ మాత్రం ఆ టిక్కెట్ తమకే దక్కించుకోవాలన్న గట్టి ప్రయత్నంలో ఉంది. అవసరమైతే మంత్రి పదవిని సైతం త్యజించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద నంద్యాల సీటు భూమా ఫ్యామిలి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మ‌రి ఈ కొత్త స‌మ‌స్య‌ను బాబు ఎంత‌ర‌కు తీర్చుతాడో చూడాలి మ‌రి.

{loadmodule mod_sp_social,Follow Us} 

Related

  1. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతోంది..ఇక ఉపేక్షించేదిలేద‌న్న బాబు
  2. సొంత జిల్లాలో బాబు స‌మావేశానికి డుమ్మాకోట్టిన బొజ్జల,ఎంపీ శివప్రసాద్‌ 
  3. కేంద్రం సంచలన నిర్ణయం.. జబర్దస్త్ పటాస్ షో లకు షాక్
  4. వైకాపాలోకి పురందేశ్వ‌రీనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -