ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైకపా నేత భూమాన కరుణాకర్ రెడ్డి విరుచుకు పడ్డారు. చంద్రబాబు కి అర్ధం లేని కోపం ఉంది అని దాని వలెనే ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన మండి పడుతున్నారు.
పుష్కరాల సమయం దగ్గర నుంచీ సింధూ విషయం లో వరకూ సొంత డబ్బా కొట్టుకోవడం కోసమే ఆయనకీ టైం సరిపోయింది అనీ జనాల్లో పబ్లిసిటీ ఒస్తుంది అని చెప్తే కృష్ణాష్టమి రోజు ఉట్టి కూడా కొడతారు అని చెప్పారు ఆయన. చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఒక రాచపుండులా మారిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో గోదావరి జిల్లాలకు కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడిందని… ఇంతకుముందెన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు. అనంతపురం – చిత్తూరు – కర్నూలు జిల్లాల్లో వేరుశెనగ రైతుల పంట ఎండి అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా సంబరాలుచేసుకుంటున్నారని మండిపడ్డారు.
12 రోజుల పాటు పాలనను గాలికి వదిలేసి పుష్కరాలతో గడిపేసిన చంద్రబాబు ఇప్పటికైనా మారాలని… అసెంబ్లీని ఐదు రోజులే సమావేశపరుస్తామని చంద్రబాబు చెప్పడం ప్రజాసమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నిదర్శనమని భూమన అన్నారు.
Related