వైసీపీ పార్టీకి సొంత ఎమ్మెల్యే ద్రోహం చేనట్టే.. ఇప్పటికే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన గెలావాలి అని..చూస్తున్న జగన్… సొంతపార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. వల్ల.. వైసీపీకి అందనంత దూరంలోకి వెళ్లిపోయారు ఉద్యోగులు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం.. అప్పుడు ఒక్కొక్క అధికారి అంతుచూస్తాం.. అంటూ చెవి రెడ్డి వ్యాఖ్యలు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో మంట పుట్టిస్తోంది.
{loadmodule mod_custom,GA1}
ఇలా మాట్లాడం పై వారు కోపం ఉన్నారు. అయిన ప్రతిపక్షంలో ఉన్నవారు.. ఉద్యోగులను మచ్చిక చేసుకునేది పోయి… ఇలా మాట్లాడటం వల్ల.. విమర్శలు పలు అవుతారు తప్ప వచ్చేది ఏం ఉండదని అంటున్నారు. వాస్తవానికి ఉద్యోగులతో వైరం పెట్టుకున్న ఏ పార్టీ.. ఎక్కువ కాలం అధికారంలో లేదు. అయిన ప్రభుత్వ ఉద్యోగులకు.. రాజకీయాలతో ఎలాంటి సంబంధం వుండదు.కేవలం ప్రభుత్వాదేశానుసారం పనిచేయాల్సి వుంటుందే తప్పా,అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్షపార్టీలపై పగ పెంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది సొంతపార్టీ నేతలే ఆగ్రహించుకుంటున్నారు. ఇలా అవసరం లేని విషయాల్లో వేలు పేడితే.. వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్లు కూడా రావని.. అవసరమైతే వాళ్ల సమస్యలపై పోరాడాలే తప్పా వారిపై దురుసుగా ప్రవర్తించటం వల్ల వచ్చేది ఏమి ఉండదని.. ఇప్పటికైనా కొందరు నేతలు తెలుసుకోని మెలగాలని సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులంతా ఏకమై చెవిరెడ్డి వ్యాఖ్యలపై కోపంగా వున్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయంటూ ఉద్యోగ సంఘాల నేతలు వార్నింగ్ ఇచ్చారు.
{loadmodule mod_custom,GA2}
అయితే, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. అవినీతి అధికారులను, అధికార పార్టీకి అనుగుణంగా పని చేస్తున్న అధికారులను మాత్రం తాము వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల.. పార్టీకి చాలా నష్టం కలిగేలా ఉందని.. ఓ సారి వైఎస్ జగన్ తో వైసీపీ నేతలకు క్లాస్ పీకించాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు.
{youtube}bP7LtFpcRos{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related