2019 ఎన్నికలు ఏపీలో త్రిముఖపోరు కొనసాగనుంది. అన్ని పార్టీలు అధికారాన్ని దక్కించుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయేగించుకొనేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు జగన్.త్రిముఖ పోరులో అధికార పార్టీ టీడీపీ …..మరోవైపు పవన్ కళ్యాన్ పార్టీ జనసేన…..చాపకింద నీరులా భాజాపా విస్తరిస్తున్నాయి.
డిస్సెంబర్నుంచి లేకుంటే 2018 జనవరినుంచి జనంలోకి వెల్లేందుకు జగన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు.తండ్రి బాటలోనే జగన్కూడ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని జగన్ నిర్నయించుకున్నట్లు సమాచారం.గతంలో 9సంవత్సరాల చంద్రబాబు పాలనను వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్ర ద్వారా ఎలా మట్టికరిపించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్కూడా తన తండ్రి బాటలోనే పాదయాత్ర చేపడ్తారనే వార్త ఏపీలో సంచలనంగా మారింది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఎవరు అధికారంలోకి రావాలన్న పాదయాత్ర ఫార్ములానే అందరూ ఉపయేగిస్తారు.పాదయాత్ర చేసిన వారందరూ అధికారాన్ని చేపట్టారు.పాదయాత్రకు చాలా బలం ఉంది.దేశంలో ఎంతో మంది నాయకులు పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు.రాజకీయాల్లో బ్రహ్మాస్త్రంలాంటి పాదయాత్ర అస్త్రాన్ని జగన్ 2019 ఎన్నికల్లో ఉపయేగించబోతున్నట్లు సమాచారం.
చంద్రబాబు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను జగన్ పాదయాత్రలో ప్రజలకు వివిరించనున్నారు.ఇప్పటికే వైసీపీకి ప్రజాదరన పెరుగుతోంది.ఇక టీడీపీమీద ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.రాజశేఖర్రెడ్డిని ఆదరించినట్లుగానే జగన్కూడా ఏపీ ప్రజలు ఆదరిస్తారని పార్టీశ్రేణులు భావిస్తున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read