తమిళ్ సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడనేదానిపై అభిమానుల్లో ఉన్న ఆసక్తిపై కొంత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తిలేదని… ఒక వేల దేవుడు ఆదేశిస్తే మాత్రం, రాజకీయాల్లోకి వచ్చి, అవినీతి రహిత పాలనను అందిస్తానని ప్రకటించారు. పలానా పార్టీలో చేరుతాననే వార్తలను అభిమానులు నమ్మవద్దని రజినీ కోరారు.
అయితే అభిమానుల్లో మాత్రం కొంత గందరగోలం నెలకొంది.అవినీతి రహిత పాలన.. అన్న మాట రజనీకాంత్ నోట రావడంతో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కన్ఫ్యూజన్తో కూడిన చిన్న క్లారిటీ అయితే వచ్చేసింది. త్వరలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల గుర్తు లాంటిదొకటి సంచలనంగా మారింది.
బాబా సినిమాలో రజనీకాంత్ తన వేళ్ళను వెరైటీగా మడిచి, ఓ ముద్రను చూపిస్తాడు. దాన్ని ‘చిహ్నం’గా మార్చేశారు. ఆ చేతి ముద్రకి కింత తెల్లని కలువని జోడించారు. ఇదే, తమ అభిమాన హీరో స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తు.. అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చేస్తోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
గతంలో మద్యం అలవాటు ఉండేతని …ఇప్పుడు పూర్తిగా మానేశానని..అభిమానులు ఎవరూ జోళికి వెల్ల వద్దని అభిమానులకు సూచించారు.’డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేసే అభిమానులకు నా మద్దతు వుండబోదు.. సమాజం పట్ల అంకిత భావంతో పనిచేయాలి..’ అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
చవరికి రాజకీయాల్లో కి రాను అంటూనే తన మనసులో మాటని బయటపెట్టేశాడు రజినీ.ఆయన మనసులో ఉన్న ఉన్న రాజకీయ అకాంక్షను తన అభిమానులతో పంచుకున్నారు. కొత్త పార్టీ పెర్తాడా లేకా వేరే పార్టీలల్లో చేరుతాడా అనేదానిపై ఉత్కంట కొనసాగుతోంది.అయితే రజిని రాజకీయ ముహూర్తం ఎప్పుడాని అభిమానులు ఎదురు చూస్తున్నారు.మరి దేవుడు ఎప్పుడ శాశిస్తాడో ఆయనకే తెలియాలి.
{loadmodule mod_sp_social,Follow Us}