Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీ కంచుకోట లో జగన్ కోసం జనం ఎగబడుతున్నారు ..

- Advertisement -

పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఎప్పుడూ టీడీపీకే ఓట్లు పడే ప్రాంతం ఇది. చంద్రబాబు కి చాలా ఇష్టమైన జిల్లాగా కూడా మారిపోయింది . మొత్తం అసంబ్లీ పార్లమెంట్ సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా వేరేవారికి ఇవ్వకుండా అన్నీ చంద్రబాబు కే ఇచ్చేసారు జనాలు, దాంతో చంద్రబాబు సైతం ఆ ప్రాంతానికి అతిపెద్ద ఫ్యాన్ అయిపోయారు.

ప్రభుత్వం కార్యక్రమాలు కూడా అక్కడ నుంచే మొదలు పెట్టడం తో పాటు నిధులు కూడా అక్కడ వారికే ఎక్కువగా ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి ఎమ్మెల్యే లు కూడా ఆ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు కి భారీ షాక్ కనపడింది. మంగళవారం నుంచి  ఉభయగోదావరి జిల్లాల పర్యటన ప్రారంభించిన జగన్..  కొద్దిసేపటి క్రితం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి వచ్చారు.

అక్కడ ఏర్పాటు చేసిన  జగన్ బహిరంగ సభకు జనం హాజరుచూసిన టీడీపీ శ్రేణులకు మతిపోయిందట. చంద్రబాబు దీనిపై అడిగితే ఏం చెప్పాలా అని అక్కడి నేతల్లో భయం మొదలైందట. టీడీపీ కంచుకోట అయిన ఇక్కడ తమ హవా ఉంటుంది అని చెప్పుకునే తెలుగు తమ్ముళ్ళకి జగన్ కోసం వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాక్ అయ్యిందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -