ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ అధినేత జగన్కు ఊహించని షాక్ ఇచ్చాయి. రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల బలంగా ఉన్న వైసీపీ ఓడిపోవడంతో.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్మధనం మొదలైంది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల ఎన్నికల ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, నెల్లూరు, కర్నూలు.. ఈ మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సొంతం చేసుకున్నారు. నెల్లూరు, కర్నూల్లో టీడీపీ విజయం మామూలే అయినా.. కడపలో గెలుపొందడం పార్టీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నింపింది. ఈ ఫలితాలపై ఏపీ అసెంబ్లీ లాబీలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫ్యూచర్ గురించి కూడా చర్చించుకుంటున్నట్టు మీడియాలో కథనాలు జోరుగా వస్తున్నాయి. కడపలో కీలకమైన వైసీపీ అభ్యర్థి.. వివేకానందరెడ్డి ఓడిపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు రాజకీయంగా తమ భవిష్యత్తుపై అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల దెబ్బతో సుమారు 10 మంది ఎమ్మెల్యేలు జగన్కు షాక్ ఇచ్చి టీడీపీలోకి వెళ్లేందుకు సరైన టైం అని అనుకుంటున్నారట. ఈ రిజల్ట్ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు మరికొందరు పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చించుకుంటున్నట్టు మీడియాలో వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, కడప జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, కర్నూలు నుంచి ఇద్దరు, చిత్తూరు నుంచి ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు టీడీపీ లోకి వెళ్లే దారిలో ఉన్నారట. ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి.
{youtube}v=OjgpICPbqPY{/youtube}