Thursday, May 16, 2024
- Advertisement -

షాకింగ్ : నయీం బ్యాచ్ లో అందరూ తెరాస లీడర్లు

- Advertisement -

తెలంగాణా లోని నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోమటి రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మొన్న టి నుంచీ హాట్ టాపిక్ గా మారిన నయీం గురించి మాట్లాడుతూ ఈ నారా హంతకుడికి రాజకీయాలని కుదిపేసే నెట్వర్క్ ఉంది అన్నారు ఆయన. తనని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా తప్పుకోవాలి అని నయీం బెదిరించాడు అని తప్పుకోకపోతే చంపేస్తా ని బెదిరింపు కోసం మనుషులని కూడా తన ఇంటికి పంపించాడు అని చెప్పుకొచ్చారు ఆయన.

నల్గొండ జిల్లా కి చెందిన తెరాస మంత్రి – ఇతర అధికార పార్టీ నేతలు నయీం ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నాలు చేసారు అని ఆయన ఆరోపిస్తున్నారు. తాను 2009లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి నయీం ఆగడాలను ఎదిరిస్తూ వచ్చానని అందుకే తనపై కక్ష పెంచుకున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నయీం డైరీలో ఉన్న వారి వివరాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

నయీం వ్యవహారంలో సంబంధాలున్న కీలక నేతలను రక్షించడానికి – నిజాలు బయటకు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని… నిజాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే నయీం ద్వారా లబ్ధి పొందిన నేతలు – అధికారులను కఠినంగా శిక్షించాలని  రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తానికి నయీం వ్యవహారంలో ఇంతకాలం మెత్తమెత్తగానే మాట్లాడుతున్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక్కసారి దాడి పెంచినట్లయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -