ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్.. అతని స్నేహితుడు అరవింద్.. యాక్సిడేంట్ లో చనిపోయిన సంగతి తెల్సిందే. అయితే కారు వేగంగా వెల్లడం.. వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇదే విషయంపై జర్మనీ బెంజ్ ప్రతినిధులు నివేదిక ఇవ్వనున్నారు. ప్రమాదం జరిగిన చోటును పరిశీలించినవారు పోలీసులకు తమ రిపోర్ట్ను పంపారు.
జూబ్లీహిల్స్లో మెట్రోపిల్లర్ 36కు అర్ధరాత్రి.. నిషిత్ అతడి స్నేహితుడితో కలిసి వేగంగా వెళుతూ ఢీకొట్టారు. చాలా సెఫ్టీ ఉన్న కారులో వెళ్లి వారు చనిపోవడానికి గల సరైన కారణాలు ఏమై ఉంటాయో అనే విషయంపై జూబ్లీహిల్స్ పోలీసులు మెర్సిడస్ బెంజ్ కార్ల కంపెనీ యాజమాన్యానికి 6 ప్రశ్నలతో కూడిన లేఖను పంపించారు. ఎయిర్బెలూన్లు ఏలాంటి సమయంలో తెరుచుకుంటాయి? నిశిత్ మరణించిన టైంలో ఎందుకు పగిలిపోయాయి? కారులో మెకానికల్ సమస్యలు ఉన్నాయా..? స్పీడోమీటర్ ఎంతవరకు లాక్ చేయాలి..? ఎంత స్పీడ్ ఉంటే ఎయిర్బ్యాగ్లు ఓపెన్ అవుతాయి..? సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా…? పెట్టుకోకున్న తెరుచుకుంటాయా..? అనే విషయాలు తెలుపాల్సిందిగా వారు కోరారు.
{loadmodule mod_custom,Side Ad 1}
దాంతో ఈ సంగతిపై ఆరా తీయాల్సిందిగా.. అందుకు జర్మనీ నుంచి నలుగురు ప్రతినిధులు ఇక్కడకు వచ్చి ప్రమాద జరిగిన స్థలంను.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అలానే బెంజ్ షోరూంలో ఉన్న కారును పరిశిలించారు. కారు వేగం, సీటు బెల్టు పెట్టుకున్నారా, బెలూన్లు, ఆ టైంలో ఇంజిన్ పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ప్రధానంగా బెంజ్ ప్రతినిధులు నివేదిక ఇవ్వబోతున్నట్లు సమాచారం.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}JZCpp4vAtDw{/youtube}
Related