ఏపీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కూమరుడు నిషిత్ వారం రోజుల క్రితం యాక్సిడెంట్లో మరణించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్లో మెట్రోరైల్ పిల్లర్ను అతి వేగంగా వెళ్తున్న నిషిత్ కారు ఢీ కొట్టడంతో అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో నారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది.
నారాయణ విద్యా సంస్థల బాధ్యతలను ఇప్పుడిప్పుడే చేపడుతున్న నిషిత్కు ఇలా కావడంతో కుటుంబ సభ్యులు అంతా కూడా శోక సంద్రంలో మునిగి పోయారు. ఇక చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో నారాయణ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. మంత్రి నారాయణకు పట్టింపులు చాలా ఎక్కువగా ఉంటాయి. పెళ్లి కాకుండా చనిపోయిన నిషిత్కు దహన కార్యక్రమాలకు ముందు అరటి చెట్టుతో పెళ్లి చేసి, ఆ తర్వాత దహన కార్యక్రమాలు నిర్వహించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
అలాంటి నారాయణ తన కొడుకు యాక్సిడెంట్కు కారణం అయిన కారును మళ్లీ కావాలనుకోడు అని అంతా అనుకున్నారు. కాని తన కొడుకు ఎంతో ఇష్టపడి కొనుకుని, మార్పులు చేయించుకున్న కారు కావడంతో ఆ బెంజ్ కారును రిపేర్ చేయించి తన ఇంట్లో కొడుకు జ్ఞాపకార్థం ఉంచుకోవాలని భావించాడు. తన కొడుకును ఆ కారులో చూసుకోవాలని, ఆ కారును ఎంత ఖర్చు అయినా బాగు చేయించాలని నారాయణ నిర్ణయించుకున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. బందువులు ఆ కారు అరిష్టం వద్దని చెప్పినా కూడా నారాయణ వినడం లేదట.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}Z4Kj4f-rM9E{/youtube}
Related